ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్‌చరణ్ భార్య ఉపాసనకు దాదాసాహెబ్ పురస్కారం

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2019, 12:01 PM



మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య, మెగాస్టార్ చిరంజీవి కోడలు, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవరాలు ఉపాసన కొణిదెల దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. ‘బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్ట్‌స్టైల్’ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన ఖాళీ సమయాల్లో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో స్పందిస్తూ స్ఫూర్తినిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సామాజిక సేవ కేటగిరీలో ‘ ఈ ఏటి మేటి పరోపకారి’గా దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నారు ఉపాసన. 


దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డును శనివారం ఉపాసనకు అందించింది. అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది. విభిన్న రంగాల్లో రాణిస్తూ ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్న వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపికి చేస్తుంటారు. తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. "నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ట్వీట్ చేశారు. తన భార్యకు ఈ పురస్కారం లభించడం పట్ల రామ్‌చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com