ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 07:28 PM



టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వచ్చే నెలలో రాజస్థాన్‌లో 20 రోజుల తదుపరి షెడ్యూల్ ని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత జూన్‌లో మరో 20 రోజుల షెడ్యూల్‌ జరుగనున్నట్లు టాక్.


ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ బాక్సింగ్ ప్రియుడిగా మరియు లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com