ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్ టైమ్ ని లాక్ చేసిన 'రత్నం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 08:28 PM



భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా  ఏప్రిల్ 26, 2024న విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com