ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 08:49 PM



కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 13, 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు ఫిలిం సర్కిల్ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com