ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో భారీ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్'

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 03:08 PM



టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనే ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ తాజా షెడ్యూల్‌తో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com