అక్కినేని సమంత నాగ చైతన్యతో కలిసి చేసిన 'మజిలీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు సామ్ ఆ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసింది ఈ అక్కినేని కోడలు.తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అన్ని పుకార్లకు సమాధానం ఇచ్చారు.
ఈ సంధర్బంగా సమంత” అమ్మకి నాకు మధ్య విబేధాలున్నాయనడంలో ఎటువంటి నిజం లేదు . నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మను నమ్ముతాను. ఆమె చేసే ప్రార్ధనలో ఎదో మాయ ఉంటుంది. చిన్నప్పటిలాగే నాగురించి ప్రార్ధన చేయమని అమ్మని ఎప్పుడూ అడుగుతుంటాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. మా అమ్మమాత్రం తనకోసం తాను ఎప్పుడూ ప్రార్థన చేసుకోదు,అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత. రెండో దైవం తల్లేనంటూ తన తల్లి ఫొటోనూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి రూమర్స్కి చెక్ పెట్టింది సమంత.ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి డైరెక్ట్ చేస్తున్న “ఓ బేబీ ఎంత చక్కగున్నావే” చిత్రంలో నటిస్తోంది.