యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన ఎంటర్టైనర్ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి' ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలైంది. సినిమా సక్సెస్ను యూనిట్ సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్లో...
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - నేడు సినిమా విడుదలైంది. మార్నింగ్ షోతోనే బలమైన ఓపెనింగ్స్తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఈవెనింగ్ షోతో తర్వాతనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. ఏదైతే ముందుగా మేం కథను అనుకున్నామో, తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని అనుకున్నామో. అది ఈరోజు నేరవేరింది. శిరీష్ ఫెంటాస్టిక్గా నటించాడు. మా బ్యానర్లో చేసిన `ఏబీసీడీ`ని ప్రతిష్టాత్మకంగా చేశాం. అల్లు శిరీష్, కొత్త స్టార్గా మారాడని అందరూ అంటున్నారు. తనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తనలో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. అది ఈరోజు నేరవేరింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, భరత్, వెన్నెలకిషోర్ కామెడీ హైలైట్ అయ్యాయని అంటున్నారు. అమెరికాలో పుట్టిన ఓ యువకుడు ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్న విధానాన్ని ఎంటర్టైనింగ్గా చేశారని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. 68%తో ఓపెనింగ్ అయిన ఈ సినిమా, 74% మ్యాట్నీకి పెరిగింది. సాయంత్రానికి అది 78% పెరిగింది. ఓ నిర్మాతగా చాలా సంతోషంగా ఉంది. మా శిరీష్ బెస్ట్ మూవీని `శ్రీరస్థు శుభమస్తు` సినిమాను ఈ వీకెండ్లో దాటాలని కోరుకుంటున్నాను. దాటుతామని నమ్మకంగా ఉన్నాం. త్వరలోనే పెద్ద సక్సెస్ మీట్ను నిర్వహంచబోతున్నాం అన్నారు.