సినిమాను రూపొందించాడు. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ .. ప్రతినాయకుడిగా సోనూ సూద్ నటించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు తేజ బిజీగా వున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 'సీత' పాత్రకి కాజల్ సరిగ్గా సరిపోయింది. నేను అనుకున్నట్టుగానే ఈ పాత్రకి ఆమె పూర్తిన్యాయం చేసింది. తప్పకుండా ఈ పాత్ర ఆమె కెరియర్లో చెప్పొకోదగినది అవుతుంది. ఇంతకుముందు కాజల్ తో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కలిసొచ్చి ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ .. సోనూ సూద్ కూడా అద్భుతంగా నటించారు. అనూప్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.