సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు థ్రిల్లింగ్ అంశంతో సువర్ణసుందరి చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకుడు ఎం.ఎస్ఎన్.సుర్య తెలిపారు. జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో దర్శకుడు సూర్య మాట్లాడుతూ, ఒక దర్శకుడిగా ఈ చిత్రం నాకు ఎనలేని సంతృప్తినిచ్చింది. ఇప్పటికే విడుదలచేసిన థియేట్రికల్ ట్రైలర్కు విశేషమైన స్పందన లభించింది. ప్రీ రిలీజ్ ట్రైలర్ను విడుదలచేశాం. అందరూ నన్ను నిర్మాతతో ఎక్కువ ఖర్చు పెట్టించావ్ అని అన్నారు. కానీ కథ డిమాండ్ మేరకే అధిక బడ్జెట్ ఖర్చయింది. అరుంధతి, మగధీర కోవలో సాగే చిత్రమిది. ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రంలో కామెడీ లేదు. అందుకే కామెడీ గురించి ఆలోచించకుండా ఈ చిత్రాన్ని చూడాలి. చిత్ర కథావిష యానికి వస్తే…ఆరువందల ఏళ్ల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం వల్ల తరతరాల వాళ్లను వెంటాడే కథ ఇది. ఇందులో అందరి పాత్రలు కీలకమై నవే. ఎవరివీ అతిథి పాత్రలు కావు అని అన్నారు.
నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 31న తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని భావిస్తున్నాం. వాస్తవానికి ఈ చిత్రానికి మేము ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చయింది. అయినా క్వాలిటీ కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది అని అన్నారు. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ, సినిమా ఆలస్యం కావడానికి క్వాలిటీగా బాగా రావడం కోసమేనని పేర్కొనగా….కెమెరామెన్ ఈశ్వర్ మాట్లాడుతూ, ఈ చిత్రం లేట్ అయినా మంచి కరెక్ట్ టైమ్లో విడుదల వుతోందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఇంద్ర, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తర్ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి,