తెలుగు సినిమాల్లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేయించుకున్నాడు శ్రీహరి. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు వేశాడు ఈ రియల్ స్టార్. 2013లో ఈయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు శ్రీహరి, డిస్కోశాంతిల పెద్ద కుమారుడు మేఘాన్ష్ త్వరలోనే హీరోగా పరిచయం అవుతున్నారు. కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రం `రాజ్ధూత్`. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా మేఘాన్ష్ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.