స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా తొలి షూటింగు పూర్తయింది. త్వరలోనే రెండవ షెడ్యూల్ షూటింగు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే. కాగా సెకండ్ హీరోయిన్గా ‘కేతిక శర్మ’ పేరు తెరపైకి వచ్చింది. పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా రూపొందుతోన్న ‘రొమాంటిక్’ సినిమాలో కథానాయికగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి ఈ అమ్మాయి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించడంతో, ఆయన టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం.