ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న మహేష్-గౌతమ్ ఫోటో

cinema |  Suryaa Desk  | Published : Wed, May 22, 2019, 02:34 PM



సంవత్సరాని మినిమమ్ రెండు సార్లు ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చెయ్యడం సూపర్ స్టార్ మహేష్ బాబుకి అలవాటు. ఇప్పుడు మరోసారి భార్య, పిల్లలతో కలిసి టూర్‌కి వెళ్ళాడు. మహేష్ 25వ సినిమా మహర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా రిలీజ్ ముందు నుండి, రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా సక్సెస్ మీట్, విద్యార్థులు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు, థియేటర్ కవరేజ్, విజయోత్సవ సభలు అంటూ బిజీ బిజీగా గడిపిన మహేష్, ఇప్పుడు రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసాడు.


కొద్ది రోజుల పాటు విదేశాల్లో చిల్ అవబోతున్నాడు మహేష్ బాబు.. మహర్షి సక్సెస్‌ని గౌతమ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ కొడుకుతో సరాదాగా టైమ్ స్పెండ్ చేస్తున్న పిక్‌ని మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లితో కలిసి మరో సినిమా చెయ్యబోతున్నాడు మహేష్. 2020 సమ్మర్‌లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com