బాలీవుడ్ నటి కంగనారనౌత్ వంటలు చాలా అరుదుగా చేస్తుంది..ఎంతో సంతోషంగా ఉంటే తప్ప.. రుచిరకరమైన పకోడీలు, కాఫీ వడ్డించి 2019 లోక్సభ ఎన్నికల్లో మోడీ చారిత్రాత్మక విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిందని కంగనా సోదరి రంగోలి తెలిపింది. జై హింద్.. జైభారత్ అంటూ ట్విటర్లో కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేసింది. అలాగే తమ జనరేషన్లో నరేంద్రమోడీ లాంటి నాయకుడిని పొందడం అదృష్టమంటూ రంగోలి చందేల్ కూడా మోడీకి అభినందలు తెలిపింది.