జనసేన పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఊహించని ఈ ఓటమితో జనసేన కార్యకర్తలు నిరాశ చెందారు. ఎన్నికల ముందు జనసేనకు మద్దతు తెలిపిన చాలామంది ఫలితాలు తర్వాత కూడా పవన్కు అండగా ఉంటున్నారు. వారిలో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు.
తాజాగా నిన్నటి ఫలితాల్ని గురించి ప్రస్తావించిన ఆయన గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిలిగిలిపోరు.. మార్పు తీసుకొరు. పదవుల ముఖ్యం కాదు లక్ష్యమే ముఖ్యం. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు. ఇలా చరణ్ ఓడిపోయిన తర్వాత కూడా బాబాయికి ధైర్యం ఇచ్చేలా మాట్లాడటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.