ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 రోజుల కౌంట్‌డౌన్‌లో థియేటర్లలోకి రానున్న 'తంగలన్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 03:26 PM



దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా 20 రోజుల కౌంట్‌డౌన్‌లో థియేటర్లలోకి రానుంది అని తెలియజేసేందుకు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com