రాజశేఖర్, జీవితల కూతుళ్ళు శివానీ, శివాత్మికలు వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. శివానీ.. 2 స్టేట్స్ తెలుగు రీమేక్తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అడవి శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక శివాత్మిక దొరసాని చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచనుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా నటిస్తున్నాడు. అతి త్వరలో ఇద్దరు ముద్దుగుమ్మలు వెండితెరపై అలరించనున్నారు. మరో వైపు రాజశేఖర్ కల్కి చిత్రంతో ప్రేక్షకులని పలకరించరించేందుకు సిద్దమయ్యాడు. ఈ చిత్రం 1983 బ్యాక్డ్రాప్లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుంది. అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కట్ చేస్తే రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్ళని ట్విట్టర్ మాథ్యమంలోకి ఆహ్వానిస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. రానున్న రోజులలో ఈ ఇద్దరు భామలు తమ సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేసుకోనున్నారన్నమాట. .