తెలుగులో ‘వెంకీమామ’ .. ‘డిస్కోరాజా’ .. ‘మన్మథుడు 2’ సినిమాలు చేస్తోంది నటి పాయల్ రాజ్పుత్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ సినిమా కోసం ఆమెను సంప్రదించగా, పారితోషికంగా ఆమె 75 లక్షలు అడిగిందట. దాంతో ఆ స్థాయి పారితోషికం ఆమెకి ఇవ్వాలా .. మరో నటిని సంప్రదించాలా అనే విషయంలో దర్శక ..నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారని సమాచారం. పాయల్ కి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటం వల్ల, ఆమెను ఎంపిక చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భామ తమిళంలోనే కాదు తన మాతృభాష పంజాబీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.