ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ ల కాంబినేషనల్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న వేళ కొత్త చిక్కు వచ్చిపడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా స్క్రిప్ట్ ను మురళీకృష్ణ అనే వ్యక్తి బజ్ బాస్కెట్ అనే ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాలంటే భారీగా నగదు ఇవ్వాలని మురళీకృష్ణ దర్శకుడు పూరీని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ ప్రతినిధి రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రవి ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.