‘కథనం’ చిత్రంలో యాంకర్..నటి అనసూయ ప్రధాన పాత్రధారిగా చేస్తోంది. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ఆమె మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరూ సరసన హీరోయిన్ శ్రుతి హాసన్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుందట. ఈ పాత్రను అనసూయతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయట. ఇందుకోసం అనసూయకి భారీ మొత్తంలోనే పారితోషికం ముడుతోందట.