'మహర్షి' సినిమా విజయం తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడుయూరప్ ట్రిప్ నుంచి ఇప్పుడు ఇంగ్లండ్కు మకాం మార్చేసాడు మహేశ్ బాబు. దాంతో అక్కడే జరుగుతున్న వరల్డ్ కప్ కూడా చుట్టేస్తున్నాడు సూపర్ స్టార్. ఈయన జూన్ 11కి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ 9న లండన్లో జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసుకుని ఇండియాకు రానున్నాడు మహేశ్.
ఈ మ్యాచ్ కోసమే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది. పైకి కనిపించడు కానీ మహేశ్ బాబు కూడా క్రికెట్కు వీరాభిమాని. దాంతో టూర్ కోసం వెళ్లి దాన్నిప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ కోసం మార్చేసాడు మహేశ్. కుటుంబంతో పాటు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ వెళ్లనున్నాడు మహేశ్ బాబు. అక్కడ మ్యాచ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇండియాకు రానున్నాడు.వచ్చీ రాగానే సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్తో బిజీ కానున్నాడు సూపర్ స్టార్. అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొడ్తా అంటున్నాడు అనిల్. సంక్రాంతి 2020కి సినిమా విడుదల కానుంది. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో మహేశ్ బాబుతో జోడీ కడుతుంది.