శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'విశ్వం' చిత్రం అక్టోబర్ 11న విడుదల అయ్యింది. కామెడీ, యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామా యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 300+ థియేటర్స్ ని జోడించినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్ గోపీచంద్ కి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం స్టైలిష్ మరియు వినోదభరితమైన రైడ్గా ఉంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకి బుక్ మై షోలో గత 24 గంటలలో 13.33K టికెట్స్ బుక్ అయ్యినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్, VTV గణేష్ మరియు ఇతర నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీమ్లో స్క్రీన్ప్లే రాసిన గోపీ మోహన్ మరియు ఎడిటర్గా అమర్ రెడ్డి కుడుముల వంటి ప్రముఖ సహకారులు ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.