ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విఘ్నేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన నయనతార

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 02:51 PM



ఇండస్ట్రీలో అందమైన జోడీల్లో నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ల జంట ఒకటి. వీరిని కలిపింది మాత్రం 'నేను రౌడినే' చిత్రం. విఘ్నేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌.అలా వీరి పరిచయం ఏర్పడింది. ఆ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా నయనతార ఓ ప్రత్యేక పోస్ట్‌ పెట్టారు. విఘ్నేశ్‌కుథ్యాంక్స్‌ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు.''నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా 'నేను రౌడినే'. 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు (Nayanthara) విఘ్నేశ్‌ను ఇచ్చింది'' అని రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రం గురించి గతంలో విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. ''నేను రౌడినే' సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించాను. వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది' అని చెప్పారు.2015లో విడుదలైన 'నేను రౌడినే'లో విజయ్‌సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌లోనే నయనతార, విఘ్నేశ్‌లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇది విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com