ఆంధ్రప్రదేశ్ః ఎన్నికలలలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి నేరుగా తెలుగు సినీ పరిశ్రమ భారీగా మద్దతుఇవ్వటంతో పాటు మోహన్ బాబు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, అలీ,జీవిత రాజశేఖర్, జయసుధ తదితరులు ప్రచార సభలలో పాల్గొన్నారు కూడా . ఇక వైసీపీ అధికారంలోకి రావటంతో తనకు మద్దతుగా నిలచిన సినిమా వాళ్ళకి సిఎం జగన్ ఏ పదవులు ఇస్తారా? అంటూ పలు రూమర్లు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. కాగా తొలి నుంచి వైసీపికి బాసటగా నిలచిన నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళికి వైసీపీ తరపున శాసనమండలికి పంపాలని ఆ పార్టీ సిద్దంగా ఉందని ఓ గుసగుస ఇండస్ట్రీలో వినిపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ సినీ,టీవీ రంగానికి సంబదించిన ఏపి చలన చిత్ర అభివృద్ధి సంస్ధ చైర్మన్ కావాలని పోసాని తన సన్ని హితుల ద్వారా జగన్కి చెప్పించినట్టు సమాచారం. ఇటీవల ఓ టివి చానల్కి పోసాని ఇంటర్వూ ఇస్తూ, పార్టీ గెలిచిన వెంటనే వైసీపీ పెద్దలు నన్ను కలిసి ఏమైనా పదవి కావాలా అని అడిగారు. నాకేమి వద్దు, ఎలాంటి స్వార్థం లేకుండా జగన్ కోసం పనిచేస్తానని చెప్పను. మురళి నువ్వు ఆ పదవిలో పనిచేస్తే బాగుంటుందని చెప్పి, అప్పగిస్తే చేయటానికి సిద్ధంగా వున్నానంటూ తన మనస్సులోని కోరికని బయటపెట్టాడాన్ని ఉదాహరణగా చెపుతున్నారు.