ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా జీవితంలో ఎన్నో స్మృతులు

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 11:17 PM



సౌత్‌ సినిమా ఇండస్ట్రీ లో చూడ ముచ్చటైన అందమైన జోడీల్లో నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ ల జంట ఒకటి. ‘నేను రౌడీనే’  చిత్రంతో వీరిద్దరూ ఒకటయ్యారు. విఘ్నేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి వివాహబంధం వరకూ తీసుకెళ్లింది.  ఈ సినిమా విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు. ‘నేను రౌడీనే’ విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా నయనతార స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. విఘ్నేశ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు.


‘‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడీనే’. 9 ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు. ఈ సినిమా గురించి విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను రౌడీనే’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించగా వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com