బాలీవుడ్ నటి నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దంపతులన్నకా గొడవలు సహజం. అది మంచిది కూడా. ఒకరితో ఒకరం విభేధించడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థం అవుతుందని చెప్పాడు. ‘ఇక మా విషయానికోస్తే రెండు మూడు నెలలకోసారి మేం గొడవ పడుతుంటాం. పోట్లాడుకున్నప్పుడు దాదాపు 15 రోజుల పాటు మేం మాట్లాడుకోం. తర్వాత తనో, నేనో సర్దుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలవుతుందని తెలిపాడు.