ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 02:42 PM



మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది తమకు చాలా ప్రత్యేకమని, తన తండ్రి శతజయంతి వేడుకలకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి‌ని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. వారి రాక తమకు మరింత గౌరవంగా మారనుందని పేర్కొన్నారు. ఈ వేడుకను మరుపురానిదిగా చేద్దామని రాసుకొచ్చారు.అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్నారు. చిరంజీవిని వేడుకకు ఆహ్వానిస్తున్న ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com