ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాసరి గారు చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేను: మురళీ మోహన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 12:28 PM



తెలుగు తెరపై కథానాయకుడిగా మురళీ మోహన్ ఎన్నో విజయాలను అందుకున్నారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. అలాంటి ఆయన తాజా ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 


"ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే నాకు 33 ఏళ్లు. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను. నాకు 50 ఏళ్లు వచ్చేవరకూ కథానాయకుడిగా వుండగలనేమో అనుకున్నాను. అందువలన ఈలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా ఒక ఆలోచనతోనే వరుస సినిమాలు చేస్తూ వెళ్లాను. 'వారాలబ్బాయి' నా 100 వ సినిమా .. చాలా బాగా ఆడింది. ఇండస్ట్రీలో నన్ను పైకి తీసుకొచ్చిన వ్యక్తి దాసరి నారాయణరావుగారని చెప్పుకోవాలి. 'నిన్ను పెద్ద హీరోను చేస్తాను మురళి' అని ఆయన నాతో అనేవారు .. అన్నట్టుగానే నన్ను ఒక స్థాయిలో నిలబెట్టారు. ఆయన చేసిన  మేలును ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com