ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ మొదటి టికెట్‌ను కొన్న‌డార్లింగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 10:37 PM



యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమాతో సందీప్ కిషన్ ప్రొడ్యూసర్‌గా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. రేపు రిలీజవుతున్న ఈ మూవీ మొదటి టికెట్‌ను ‘డార్లింగ్’ ప్రభాస్‌తో అమ్మకాలు మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ప్రసాద్ మల్టీ‌ప్లేక్స్‌లోని మొదటి షోకు ప్రభాస్  1116 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. ఈ శుక్రవారం ‘నిను వీడని నీడను నేనే’కు ‘దొరసాని’, ‘రాజ్‌దూత్’ సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నా హీరో సందీప్ కిషన్ సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పూర్తి హారర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ టికెట్ కొనడంతో ఈ సినిమాకు హైప్ వచ్చిందనే చెప్పాలి. కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అన్య సింగ్ హీరోయిన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com