సందీప్ కిషన్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. కార్తీక్ రాజు దర్శకుడు. అన్యాసింగ్ కథానాయిక. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను యువహీరోలు అతిథులుగా నిర్వహించారు. నిఖిల్, సుధీర్ బాబు, కార్తికేయ, విశ్వక్ సేన్ హాజరయ్యారు. వీరికి సినిమా టికెట్ను సందీప్ కిషన్ అందజేశారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ ”నా సినిమా వేడుకల్లో మంచి సినిమా చేశానని చెబుతుంటా కానీ, తొలిసారి చెబుతున్న అదిరిపోయే సినిమా తీశానని. పక్కా హిట్ అయ్యే సినిమా తీశార. టీమ్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. నా కెరీర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా ఇది. కథను నమ్మాలి, దాన్ని బాగా తీయాలి. సరైన విధంగా ప్రమోట్ చేయాలి. మనపని మనం చేసుకుంటూ వెళుతుంటే ఏ సంబంధం లేని కొందరు సినిమా ఆపడానికి ప్రయత్నిస్తారు. అన్నికంటే సినిమా గొప్పది. ఆ సినిమాను సినిమానే కాపాడుకుంటూ వస్తోంది. అదే నిను వీడని నీడను నేను. అనేక అడ్డంకులు వచ్చాయి. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ సర్దుబాటు చేసేవారు. వాళ్లే ఇక్కడి వరకు తీసుకొచ్చారు. తప్పకుండా హిట్ అయ్యే సినిమా ఇది. అదే నమ్మకంతో ఉన్నాను” అని అన్నారు.
అతిథులుగా పాల్గొన్న సుధీర్ బాబు, నిఖిల్, కార్తికేయ, విశ్వక్ సేన్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. దయా పన్నెం, అన్యాసింగ్ కూడా సినిమా గురించి తన అనుభవాలు తెలిపారు.
దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ ”ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్. సందీప్ కిషన్కు స్క్రీప్ట్ వినిపిస్తే నటించడానికి మాత్రమే కాదు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయనతో పాటుగా మిగతా ఇద్దరు నిర్మాతలు దయా పన్నెం, వీజీ సుబ్రహ్మణ్యన్గారి థాంక్స్” అని అన్నారు.