తెలుగు సినీ ఇండస్ట్రీలోలోని అందరు స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది టబు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో హవా చూపించింది. అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కూడా అగ్ర కథానాయకులతో నటించి, మెప్పించింది. కానీ, మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ రావడంతో కొద్ది సంవత్సరాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. తెలుగులోనూ నందమూరి బాలకృష్ణ 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మళ్ళీ కనిపించలేదు. అయితే, కొద్ది సంవత్సరాల క్రితం హిందీలో రీ ఎంట్రీ ఇచ్చిన టబుకు రీసెంట్గా 'అంధాధున్' భారీ హిట్ను ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్ను జోరుగా సాగిస్తోన్న ఈ సీనియర్ నటి అన్ని భాషల్లో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తన వారసుడిని బాలీవుడ్కు పరిచయం చేయాలని డిసైడ్ అయిపోయింది. అదేంటి..? టబుకు పెళ్లి కాలేదు కదా.. వారసుడు అంటున్నారేంటి..? అనుకుంటున్నారా..? ఆగాగండి.. వారసుడు అంటే సొంత కొడుకు కాదు. అక్క కుమారుడు
అవును.. టబు అక్క ఫర్హా కుమారుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడే ఫతే రాంధవ. పేరుకు అక్క కొడుకే అయినా చిన్నప్పటి నుంచి టబు దగ్గరే ఎక్కువగా ఉండేవాడు. అతడంటే టబుకు చాలా ఇష్టం. అందుకే తన సొంత కొడుకు లాగే చేసుకునేది. ఈ క్రమంలోనే రాంధవకు నటనలో శిక్షణ కూడా ఇప్పించింది. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకున్న ఈ కుర్రాడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా శ్రీదేవి కూతురు నటిస్తున్న సినిమాలో. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ జోహార్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రాల్లో 'దోస్తానా 2' ఒకటి. ఈ సినిమాలోనే ఫతే రాంధవ అవకాశం దక్కించుకున్నాడు. 2008లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'దోస్తానా'కు ఇది కొనసాగింపు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యతో పాటు శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ కూడా నటిస్తోంది. సక్సెస్ఫుల్ సినిమాకు సీక్వెల్ కావడంతో దీనిపై బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి.