యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తదుపరి సినిమా `సాహో`ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. `బాహుబలి`తో ప్రభాస్ క్రేజ్ దేశాలు దాటింది. దీంతో ఆయన `సాహో` మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 15న సినిమా విడుదలకానుంది. సినిమా కొంత ప్యాచ్వర్క్ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటీవల ప్రభాస్, శ్రద్ధాకపూర్ నటించిన `సయ్యా సైకో..` అనే పబ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ అల్ట్రామోడల్ సాంగ్కు తెలుగు, తమిళం కంటే హిందీలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్లో అప్కమింగ్ హీరోయిన్ మవ్రా హొకెన్ సయ్యా సైకో సాంగ్ను హ్యాష్ ట్యాగ్తో జత చేస్తూ ప్రబాస్.. అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఈమె బాలీవుడ్లోనూ `సనమ్ తేరీ కసమ్` సినిమాలో నటించింది. మన పొరుగుదేశానికి చెందిన ఓ హీరోయిన్..అందులో పాకిస్థాన్ హీరోయిన్ `సాహో` సాంగ్ గురించి ప్రస్తావించడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.