త్వరలో ఆరంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 షోనివరుస వివాదాల మాటున చిక్కుకుంటోంది. నాగార్జున పాటు 10 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ బిగ్ బాస్ 3, సినిమాలాగా ఎపిసోడ్ లను సెన్సార్ చేయాలని, అంతవరకు షో నిలిపివేయాలని కొందరు , హైకోర్టులో పిల్ దాఖలు చేయటంతో కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే, తాజాగా దాఖలైన పిల్లో అసభ్యకరమైన తీరుగా ఉంటున్న ఈ షోని రాత్రి 11 గంటల తర్వాతే ప్రసారం చేసేలా ఆదేశాలివ్వలనికోర్టుకు పిటిషనర్ విన్నవించడం గమనార్హం. ఇందుకు గత షోలలో జరిగిన తతంగాల వీడియోలను సమర్పించేందుకు పిటీషనర్ తరపు న్యాయవాదులు సిద్దమైనట్టు సమాచారం. తాజా కేసులో
మరోవైపు బిగ్ బాస్ టీమ్ పై పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులన్నీ కొట్టేయాలని, బిగ్ బాస్ నిర్వాహకులుక్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.