స్టార్ నటుడు ప్రభాస్ సాహో చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగాడు. అంతేకాదు పార్టీ కూడా చేసుకున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పలువురు టెక్నీషియన్లతో కలిసి ప్రభాస్ దిగిన ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2017 జూన్ 9న ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారతీయ అతిపెద్ద యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి 25 నెలలు పట్టింది. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.