నాగశౌర్య హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా నిర్మించబోతున్న సినిమాలో మూడు కథలు ఉంటాయని, ఒక్కో కథకి ఒక్కొక్కరు దర్శకత్వం వహించబోతున్నారని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు దర్శకులు ఎవరంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో వైరల్ గా మారింది కూడా.
కాగా దర్శకేంద్రుడు చెపుతున్న ముగ్గురు దర్శకులు మూడు కథలులో రెండింటిని రాఘవేంద్రరావు తనయుడైన ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మరోదానికి క్రిష్ దర్శకత్వం వహిస్తాడని ఫిలంనగర్ సమాచారం. అయితే ఆ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.