నటి అక్షరా హాసన్ కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘కడరం కొండాన్’. దీనిని తెలుగులో ‘మిస్టర్ కేకే’ టైటిల్తో విడుదల చేస్తున్నారు. రాజేశ్ సెల్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అక్షర మీడియా సమావేశంలో పాల్గొంది. సినిమా గురించి మాట్లాడుతూ.. ‘విక్రమ్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో నేను నాజర్ కుమారుడు అభి హసన్కు జోడీగా నటించా. సినిమాలో నా పాత్ర పేరు అకీరా. ఈ పాత్ర కోసం మా అమ్మ సారిక సూచనలు తీసుకున్నా. ఇది ఛాలెంజ్తో కూడుకున్న చిత్రం. విక్రమ్ పాత్రలో పరకాయప్రవేశం చేశారు. దర్శకుడు రాజేశ్ తనకు కావాల్సిన విధంగా సీన్లు రాబట్టుకునే వారని తెలిపింది. . ఇక మా అక్క శ్రుతి హాసన్ గురించి చెప్పాలంటే నా విషయాల్లో తను, తన విషయాల్లో నేనూ జోక్యం చేసుకోం. కలిసినప్పుడు కూడా సినిమాల గురించి కూడా చర్చించుకోం’ అని తెలిపింది.