మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్నెస్ ఉంది అంటున్నాడు యువ కథానాయకుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుమప పరమేశ్వరన్ కథానాయిక. రమేష్ వర్మ పెన్మత్స దర్శకుడు. గురువారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ‘నేనంటే భయానికే భయం.. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్ కిల్లర్ పోలీస్ ఆఫీసర్ అయిన బెల్లకొండ శ్రీనివాస్కు వార్నింగ్ ఇస్తున్న డైలాగ్లో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? వాడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఈ నేపథ్యంలో కథానాయకుడికి ఎదురైన సంఘనటలు ఏవి? మొత్తం తెరపై చూడాల్సిందే.
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రాక్షసుడు’ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.