సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తాజాగా సితార తన స్నేహితురాలు ఆద్యా (దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు)తో కలిసి ఏ అండ్ ఎస్ (A & S) పేరుతో యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. . మొదటి వీడియోగా '3 మార్కర్స్ చాలెంజ్' పేరుతో ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 30 వేలకు పైగా వ్యూస్ సాధించటం విశేషం. సితార, ఆద్యాల వీడియోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన మహేష్.. చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.