కాంట్రవర్శీలతో బెనెఫిట్స్ పొందాలని చూసే నటీమణుల్లో ఒకరైన పాకిస్థాన్కి చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్ మరోసారి వివాదాస్పద ట్వీట్ చేసింది. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్భూషణ్ జాదవ్కు ఉరి శిక్ష వెయ్యాలన్న పాకిస్థాన్ నిర్ణయాన్ని ఇటీవలే అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుపట్టింది. అలాంటిది వీణా మాలిక్ మాత్రం... ఈ అంశంపై వివాదాస్పద ట్వీట్ చేసింది. తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రవాదులపై జాలి చూపకూడదన్న ఆమె... వాళ్లను సరిహద్దుల్లో ఉరి తియ్యాలని కోరింది. అప్పుడే ఇండియాకి చెందిన ఉగ్రవాదులు, గూడఛారులకు బుద్ధి వస్తుందన్నట్లుగా ట్వీట్ చేసి... తన అక్కసు వెళ్లగక్కింది వీణా మాలిక్.ఆమె పెట్టిన ట్వీట్పై నెటిజన్లు కూడా అంతే ఘాటుగా స్పందించారు.
నువ్వు ఇంత స్టుపిడ్ అనుకోలేదు అని కొందరు అంటుంటే... మరికొందరు ఆమెకు హిస్టరీ అంతా చెప్పి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో బోల్డ్ సీన్లతో అభిమానులను సంపాదించుకునేందుకు ట్రై చేసి ఫెయిలైన వీణా మాలిక్... ఇలాంటి వివాదాస్పద కామెంట్లతో క్రెడిట్ సంపాదించుకోవడాని ట్రై చేస్తోందనీ, ఆమె కెరీర్కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడుతుందని ట్టిట్టర్లు ఫైర్ అయ్యారు.