ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2019, 11:18 AM



కోడంబాక్కం: రజనీకాంత్‌ హీరోగా ‘పేట’ చిత్రాన్ని రూపొందించి హిట్‌ అందుకున్నారు దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ధనుష్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు కార్తిక్‌ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ‘మెర్క్యురి’, ‘పేట’ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ధనుష్‌ హీరోగా ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే స్క్రిప్ట్‌ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోది. వైనాట్‌ స్టూడియో బ్యానరుపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ధనుష్‌కు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మీ నటించనుంది. మలయాళంలో మాయనది, వరదన్‌ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ అమ్మడు అగ్రనాయికగా మారింది. ఇప్పుడు ధనుష్‌తో జోడీ కడుతోంది. అంతేకాకుండా సుందర్‌.సి దర్శకత్వంలో విశాల్‌, తమన్నా నటిస్తున్న సినిమాలో కూడా రెండో హీరోయిన్‌గా ఈమె ఎంపికైంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com