కోడంబాక్కం: రజనీకాంత్ హీరోగా ‘పేట’ చిత్రాన్ని రూపొందించి హిట్ అందుకున్నారు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ధనుష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు కార్తిక్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ‘మెర్క్యురి’, ‘పేట’ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ధనుష్ హీరోగా ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోది. వైనాట్ స్టూడియో బ్యానరుపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ధనుష్కు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మీ నటించనుంది. మలయాళంలో మాయనది, వరదన్ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ అమ్మడు అగ్రనాయికగా మారింది. ఇప్పుడు ధనుష్తో జోడీ కడుతోంది. అంతేకాకుండా సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా నటిస్తున్న సినిమాలో కూడా రెండో హీరోయిన్గా ఈమె ఎంపికైంది.