అనేక హిందీ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కోన మిత్రకు కోర్టులో చెక్కెదురైంది. పూనమ్ సేథీ అనే మరో నటి వేసిన చెక్ బౌన్స్ కేసులో కోర్టు మిత్రకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. తన వద్ద 22 లక్షలు తీసుకుని చెల్లని చెక్కులు ఇచ్చినట్టు పూనమ్ ఆమెపై కోర్టులో కేసు వేసింది. కేసుని విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కోన మిత్రకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు పూనమ్ సేథీకి రూ.4.64 లక్షలు, వడ్డీగా ఇంకో రూ.1.64 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పూనమ్ తనను మోసం చేసి చెక్కులు దొంగిలించిందని మిత్ర కోర్టులో వాదించినా ఆధారాలు లేకపోవడంతో న్యాయమూర్తి ఆమె వాదనలను కొట్టిపారేస్తూ తీర్పునిచ్చారు.