నార్సింగ్ కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ అరెస్ట్ అయిన కాసేపటికే బెయిల్పై విడుదలయ్యాడు. రాజ్ తరుణ్ను అరెస్ట్ చేసి పోలీసులు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. 41 సీఆర్పీసీ కింద రాజ్ తరుణ్కు నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు రాజ్ తరుణ్ను ఆయన యాక్సిడెంట్ వీడియో తో బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్పై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తిక్ను అరెస్ట్ చేసి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తామని పోలీసులు తెలిపారు.