రాజమౌళి రూపొందించిన `బాహుబలి` భారతీయ సినిమా గతినే తిరగరాసింది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అందర్నీ థియేటర్లకు రప్పించింది. ఎవ్వరూ కలలో సైతం ఊహించని కలెక్షన్లు సాధించి కొత్త చరిత్ర ను రూపొందించింది . `బాహుబలి`తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన తాజా చిత్రం `సాహో` ను తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమిళనాడులో ఈ సినిమా భారీగా విడుదల కాబోతోంది. ఏకంగా 550 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. `బాహుబలి-2` సినిమా తమిళనాడు 525 థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటివరకు అదే రికార్డు. తాజాగా ఆ రికార్డును `సాహో` దాటింది. మరి, `బాహుబలి` రికార్డులను కూడా `సాహో` దాటుతుందేమో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.