ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కథానాయకుడిగా మారనున్న తేజ

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 01:12 PM



‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పిన తేజ ఇప్పుడు కథానాయకుడిగా మారుతున్నాడు. తేజ కథానాయకుడిగా  త్వరలోనే ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. శుక్రవారం తేజ పుట్టిన రోజు  సందర్భంగా తేజ మాట్లాడుతూ ‘‘బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా తేజ ఇప్పుడు బీబీఏ పూర్తి చేశాడు . ‘ఓ బేబీ’తో నందినిరెడ్డిగారు మంచి పాత్ర ఇచ్చారు. అందులో నా నటనకు వచ్చిన గుర్తింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఓ బేబీ’ తరవాత దాదాపు 20 కథలు విన్నాను. ఏవీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఇప్పుడు మంచి కథ  దొరికింది. ప్రేమకథలు చేసే వయసు నాది. అలాంటి కథల్లోనూ గమ్మత్తైన విషయం ఉండేలా జాగ్రత్త పడుతున్నా’’ అన్నారు. తన చిన్ననాటి అనుభవాలు గుర్తు చేసుకుంటూ   ‘‘చిరంజీవిగారు నన్ను బాగా చూసుకునేవారు. ఆదివారం అయితే ఆయన ఇంట్లోనే ఉండేవాణ్ని. నేను, సాయిధరమ్‌తేజ్‌, నిహారిక, శ్రీకాంత్‌గారి అబ్బాయిలు అందరం కలిసి ఆడుకునేవాళ్లం. చిరంజీవిగారి ఇంట్లో మేం చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ‘హీరో అవ్వాలనుకుంటున్నావు కదా.. గుర్రపుస్వారీ నేర్చుకో’ అని ఆయన సలహా ఇచ్చారు. దాంతో గుర్రపుస్వారీ నేర్చుకున్నా. ఇదివరకే నేను వెస్ట్రన్‌ డ్యాన్స్‌లో శిక్షణ పొందాను అన్ని తెలిపాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com