ఆ ‘పండూ’ పేరు... లావణ్య. అలా ముద్దుగా పిలిచింది... పూరీ జగన్నాథ్. ప్రముఖ సినీ దర్శకుడు. ఆయన ప్రేమికురాలు... శ్రీమతి.. బహుమతి... ఈ లావణ్య. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. అనురాగ దాంపత్యానికి వారి జంట ఓ ఐకాన్. ఈ మధ్యన... పూరీ దర్శకత్వంలో, నటి ఛార్మీ నిర్మాణంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా వచ్చింది. సూపర్ డూపర్ హిట్టయింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో, ఆ తరువాత విజయోత్సవాలలో ఈ దర్శకుడు-నిర్మాత సన్నిహితంగా ఉండడాన్ని సోషల్ మీడియా గాసిపర్లు, రూమరోళ్లు గమనించారు. అంతే.... తమ రోత రాతలకు, చెత్త వాగుళ్లకు చక చకా పని పెట్టేశారు... వీరిద్దరి ‘ఎఫైర్’తో పూరీ భార్య లావణ్య గరం.. గరంగా ఉన్నారని, భర్తతో గొడవ పడుతోందని... ఇలా ఇలా ఏవేవో తమ బుర్రకు తోచినట్టుగా రాసేశారు, వాగేశారు. అందుకేనేమో... పూరీజగన్నాథ్... తన భార్యను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘23వ మ్యరేజ్ యానివర్సరీ.... పండూ... ఐ లవ్ యూ... ఆల్వేస్..’ అని, క్యాప్షన్ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో పూరి యాక్టివ్ గానే ఉంటారు, కానీ, తన కుటుంబం... తన సతీమణి గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. ఫోటోలు కూడా షేర్ చేసుకోరు. గత కొన్ని రోజులుగా తనపై రకరకాల రూమర్లు, గాసిప్పు, గుసగుసలు, ఇకఇకలు, పకపకలు... అదే పనిగా నెట్టింటిని చుట్టేస్తుండడంతో.... దానికి చెక్ పెట్టేందుకు ఇలా తన సతీమణితో దిగిన ఫోటోను పోస్ట్ చేసి ఉండొచ్చు.
ఛార్మీ కూడా సేమ్ ఫోటోను తన Instragramలో పోస్ట్ చేశారు. దానికి.. "ఇద్దరికీ హ్యాపీ యానివర్సరీ. ఇద్దరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి" అంటూ, శుభాకాంక్షలు తెలిపారు.