ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ బయటికి పంపారు. అలీరెజా ఎలిమినేట్ అయినట్టు నాగ్ చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ షాక్కు గురయ్యారు. ఇక శివజ్యోతి పాతాళగంగలా మారిపోయింది. శివజ్యోతి వెక్కి వెక్కి ఏడుస్తూ అలీని వీడలేకపోయింది. శ్రీముఖి కూడా కన్నీరు పెట్టుకుంది. తాను వెళ్తుంటే.. ఇంత మంది ఏడుస్తున్నారు.. ఇది చాలు.. టైటిల్ గెలవకపోయినా పర్లేదు అంటూ అలీ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్మేట్స్ అందరూ కలిసి అలీకి వీడ్కోలు చెప్పారు. బయటకు వచ్చిన అలీ.. హౌస్మేట్స్తో ఫోన్లో పర్సనల్గా మాట్లాడేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. స్ట్రాంగ్గా ఉండంటూ, ఏడ్వొద్దని శివజ్యోతికి సూచించాడు. ఎలా ఆడుతున్నావో అలానే ఆడు, బాబా భాస్కర్ను చూస్తూ ఉండంటూ మహేష్కు సలహా ఇచ్చాడు. మంచోడు మంచోడు అంటే సరిపోదు.. గేమ్ కూడా ఆడు.. జ్యోతిని సరిగా చూసుకో అంటూ రవికి, అమేజింగ్, ఎలా ఆడుతున్నావో అలానే ఆడు.. ఫైనల్ వరకు ఉంటావని వరుణ్కు సూచించాడు. పునర్నవి-అలీ పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. కొంచెం చూస్తూ మాట్లాడు అంటూ రాహుల్కు, జ్యోతిని కూడా కాస్త చూస్తూ ఉండు అని వితికాను కోరాడు. విన్నర్గా చూడాలనుకుంటున్నా అని శ్రీముఖికి తెలిపాడు.