ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్జెఠ్మలానీ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న కన్నుమూశారు. ఆయనకు సినీరంగంతోనూ పరిచయాలున్నాయి. తెలుగులో ‘రణం’, ‘సామాన్యుడు’, ‘బెండు అప్పారావు’, ‘కత్తి కాంతారావు’, ‘జగద్గురు ఆదిశంకర’ తదితర సినిమాలలో నటించిన కామ్నా జఠ్మలానీ...రామ్జెఠ్మలానీకి మనుమరాలు. ఆమె తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తల్లి ఫ్యాషన్ డిజైనర్. కామ్నా జఠ్మలానీ 2014లో బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్పాల్ను వివాహం చేసుకున్నారు. పెళ్ళి తరువాత కామ్నా జఠ్మలానీ సినిమాలకు దూరంగా ఉన్నారు.