హైదరాబాద్లో ఆదివారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా చాలా మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది స్టార్లు లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు కమిట్ అయ్యింది.
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రదర్శన తర్వాత రకుల్ ప్రీత్ పెర్ఫార్మెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రావడంతో హడావుడి మొదలైంది. ఆ వెంటనే ప్రముఖుల స్పీచ్ల కార్యక్రమం మొదలైంది. ఆ వెంటనే చిరంజీవిని పైకి ఆహ్వానించి మాట్లాడించారు. ఈ క్రమంలో రకుల్ ప్రదర్శన సాధ్యం కాలేదు. దీంతో రకుల్ అలిగి ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.