'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ వేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలోని ఒక పాటలో మహేశ్ సరసన తమన్నా. అయితే ఇది ఐటమ్ సాంగ్ కానీ .. స్పెషల్ సాంగ్ గాని కాదట.ఈ సాంగ్ లో తమన్నా వయ్యారాలు ఒలకబోస్తూ స్టెప్స్ వేసేలా ప్లాన్ చేశారట. మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని అంటున్నారు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండటంతో బ్రేక్ లేకుండా షూట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.