ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు-సాయిపల్లవి...

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 03:49 PM



బ్లాక్ బస్టర్ హిట్  'ఫిదా' తరువాత కొత్త హీరోహీరోయిన్లతో శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆయన మరో కథను సిద్ధం చేసుకుని, చైతూ - సాయిపల్లవి జంటగా రూపొందించడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో, హైదరాబాదులో ఈ రోజున రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.


నాయకా నాయికల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. శేఖర్ కమ్ముల కథలు లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుని ఉంటాయి. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగనుందని అంటున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com