బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్ లు చిత్ర దర్శకులకు పెద్ద బలాన్నే ఇచ్చాయి. సౌత్ సినిమాను విశ్వవిఖ్యాతం చేసి ఎవరికీ అందనంత ఎత్తులో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూర్చోబెట్టగా 2.0, సాహో, సైరా వంటి భారీ చిత్రాలూ దానిని నిలపే ప్రయత్నం చేసాయి. అయితే రెండున్నర సంవత్సరాలలో బాహుబలి స్థాయిని చేధించలేక భారతీయ చిత్ర పరిశ్రమ దిగాలు పడిందనే చెప్పాలి. అయితే పాన్ ఇండియా చిత్రాలకు ఊపిరులూదిన బాహుబలి స్పూర్తి అందుకున్న తమిళ దర్శకుడు మణిరత్నం తాజాగా "పొన్నియన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు.
బాహుబలి మించిన శక్తివంతమైన "చోళరాజు పొన్నియన్ సెల్వన్" కథతో - మణిరత్నం భారీ సినిమా!!
చోళ రాజ్య పాలన నేపధ్యంలో వీరుడైన ఈయన అసలు పేరు అరుల్మోజివర్మన్ కథ ఈ సినిమాకు ఆధారం పది పదకొండు శతాబ్ధాలలో ఈ దేశాన్ని సరిహద్దులను దాటి పరిపాలించిన చోళ రాజవంశం మూల పురుషుడే పొన్నియన్ సెల్వన్ లేదా అరుల్మోజి వర్మన్. రాజ్యాభిషేకం తరవాత ఇతనే రాజరాజ చోళ సార్వబహుముడుగా ప్రసిద్ధుడయ్యాడు. చోళ సామ్రాజ్యం 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాళ చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుళోత్తుంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10,11,12,13 శతాబ్దంలో ఉచ్ఛస్థితిని అనుభవించింది. మొదటి రాజ రాజ చోళుడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేష్ లోని గోదావరి పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళుడు భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పాటలీపుత్రంరాజధానిగా పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీప సమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా జైత్రయాత్రలు జరిపారు.